పాకిస్తాన్ క్రికెట్‌లో సంక్షోభం: చైర్మెన్ రేసు నుంచి తప్పుకున్న నజం సేథీ

పాకిస్తాన్ క్రికెట్‌లో సంక్షోభం: చైర్మెన్ రేసు నుంచి తప్పుకున్న నజం సేథీ

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత పీసీబీ తాత్కాలిక చీఫ్‌ నజం సేథీ.. తదుపరి ఛైర్మన్‌ రేసు నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించా రు. తదుపరి చీఫ్‌గా ఆయనే ఎన్నిక అవుతారని భావిస్తున్న తరుణంలో రేస్ నుంచి తప్పుకోవడం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ నిర్ణయం రాజకీయ శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తాను బోర్డులో శాశ్వత స్థానాన్ని కోరుకోవడం లేదన్న నజం సేథీ.. తాను పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు అసిఫ్‌ జర్దారీ, ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ మధ్య వివాదాలకు కారణం కాకూడదని వెల్లడించారు. "అందరికీ నమస్కారం.. అసీప్‌ జర్దారీ, షహబాజ్‌ షరీఫ్‌ల మధ్య వివాదానికి నేను కారణం కాకూడదని అనుకుంటున్నా. అందువల్ల నేను ఛైర్మన్‌ రేసు నుంచి తప్పుకుంటున్నా. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి మంచిది కాదు..' అంటూ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. జూన్ 21తో సేథీ పదవీ కాలం ముగియనుంది.

Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders.

— Najam Sethi (@najamsethi) June 19, 2023